ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో 50 ఏళ్ల రైతు తన పొలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. శ్రీపాల్ అనే రైతు వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో ఫోన్ లో మాట్లాడుతుండగా అతడిపై పిడుగుపడింది. దీంతో శ్రీపాల్ అక్కడిక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుని సంఘటన స్థలానికి కుటుంబీకులు చేరుకునే సరికే బాధితుడు మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి రైతు మృతి
April 30, 2023
0
Tags