దేశంలో కొత్తగా 5,874 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,874 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 25 మంది మృతి చెందగా వీరిలో కేరళలోనే 9మంది చనిపోయారు. నిన్న 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి. ఇప్పటివరకు 4,43,64,841 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 49,015 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి మరో 5,31,533 మంది మృతి చెందారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31శాతం ఉంది. రికవరీ రేటు 98.71శాతం, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,20,66,66,261 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు  కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)