దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరింది. మృతుల సంఖ్య 5,31,300కు పెరిగింది. వైరస్ సోకిన వారిలో 4,42,83,021 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు.
దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు నమోదు
April 22, 2023
0