H3N2 వైరస్‌తో ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఈ వైరస్ తో చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతుండటం కొంత కలవరానికి గురి చేస్తోంది. ప్రాణాంతకం కాదనే నిపుణుల మాటలే ధైర్యాన్ని నింపుతున్న సందర్భంలో ఈ వైరస్ తో మరణాలు సంభవించాయన్న పిడుగు లాంటి వార్త ఇప్పుడు బయటకు వస్తుంది. కొన్ని ఉన్నత అధికారవర్గాల సమచారాం ప్రకారం.. హెచ్ 3ఎన్2 వైరస్ ఇన్ ప్లుయోంజాతో మన దేశంలో రెండు మరణాలు సంభవించాయి. కర్ణాటకలో, హర్యానాలో ఒక్కో మరణం సంభవించినట్లు ఆ వర్గాలు తెలిపారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మార్చి 1వ తేదీన 82 ఏళ్ల హీరే గౌడ్ ఇన్ ప్లుయెంజాతో మరణించినట్లు తెలిపారు. కర్ణాటకలో తొలి ఇన్ ప్లుయెంజా మరణం చోటు చేసుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్ తరహా లక్షణాలనే పోలిన ఈ ఇన్ ప్లుయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయి. ఒక వేవ్ తరహాలో చాలా ప్రాంతాలకు ఈ ఇన్ ప్లుయెంగా పాకింది. ఇందులో చాలా వరకు హెచ్3ఎన్2 వైరస్ కేసులే ఉన్నాయి. ఈ వైరస్ ను హాంగ్ కాంగ్ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. ఇతర ఇన్ ప్లుయెంజా సబ్ టైపుల్లో ఈ హెచ్ 3ఎన్2 వైరస్ ఎక్కువ మందికి సోకుతూ హస్పటళ్ల పాలు చేస్తుంది. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, ఊపిరి ఇబ్బందిగా తీసుకోవడం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు ఈ ఇన్ ప్లుయెంజా బారిన పడిన వారిలో కనపిస్తున్నాయి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉన్నదని నిపుణులు తెలిపారు. దగ్గు, స్నీజింగ్, సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వైరస్ సులభంగా వ్యాపించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. హెచ్3ఎన్2 వైరస్ ఇతర సబ్ టైప్ ల కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుందని.. అందుకే ఈ వైరస్ సోకడంతో చాలా మంది హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడైంది. గత రెండు.. మూడు నెలలుగా భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ ప్లుయెంజా సోకిన వారిలో దగ్గు, జ్వరం దీర్ఘకాలం కొనసాగుతున్నాయని వివరించారు. దీర్ఘకాలం ఈ లక్షణాలు ఉంటున్నాయని పేషెంట్లు చెబుతున్నారు. ఈ ఇన్ ప్లుయెంజా నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నదని ఓ డాక్టర్ తెలిపారు. ఈ వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని.. అది దీర్ఘకాలం కొనసాగుతుందని అన్నారు. అంతేకాదు.. పేషెంట్ రికవరీ అయిన కొందరిలో ఈ లక్షణాలు ఉంటున్నాయని వెల్లడించారు. అయితే ఇది ప్రాణాంతకరమైనదేమీ కాదని క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ డాక్టర్లు పేర్కొంటున్నారు. కానీ, శ్వాసకోస సంబంధ సమస్యలతో పలువురు పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరుతున్నారి వివరించారు. కొన్ని లక్షణాలు చాలా వరకు కొవిడ్ ను పోలి ఉంటున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఈ వైరస్ బారిన పడి తమ వద్దకు వచ్చిన పేషెంట్లకు కరోనా నెగిటివ్ అని వచ్చిందని వైద్యులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)