రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని కరీంనగర్‌ పట్టణానికి చెందిన రజిత  సిరిసిల్ల జిల్లాలోని ఇల్లందకుంట మండలం రహీమ్‌ఖాన్‌పేట మోడల్‌ స్కూల్‌లో గణితం టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, రజిత రోజు మాదిరిగానే శుక్రవారం కూడా విధులకు బయలుదేరింది. కాగా, స్కూటీపై ఓ ప్రైవేటు స్కూల్‌ వరకు వెళ్లి, అక్కడే వాహనం పార్క్‌ చేసి ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్కూటీపై స్కూల్‌కు వెళ్తుండగా సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులో ఓ సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ రజిత స్కూటీకి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జు అయిపోయింది. లారీ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే రజిత మృతి చెందారు. అయితే, రజిత హెల్మెట్‌ ధరించినప్పటికీ ఆమె చనిపోయారు. రజిత మరో 30 మీటర్ల దూరంలో స్కూటీ పార్క్‌ చేసే స్థలం ఉండటం గమనార్హం. రజితకు ఇద్దరు పిల్లలు ఉండగా, ఆమె భర్త వినోద్‌ కుమార్‌ ఐదేళ్ల క్రితమే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో రజిత కూడా చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్‌ పోలీసులు రజిత డెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)