సీపీపీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులతో రాహుల్ గాంధీ భేటీ

Telugu Lo Computer
0


లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీల్లో జోష్ నింపడానికే ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.మరోవైపు రాహుల్ గాంధీ లోక్ సభ్యత్వం రద్దుపై పార్లమెంట్ లో కాంగ్రెస్ కు విపక్షాలు పూర్తి మద్దతు తెలిపాయి. సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉంది. దీంతో శివసేన నేత సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ త్యాగం చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పినట్లు సమాచారం. పార్లమెంట్ రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్ సభ, రాజ్యసభ అట్టుడుకుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అదానీ అంశంపై విపక్షాలు ఆందోళనలతో హోరెత్తించాయి. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.  దీంతో పార్లమెంట్ ఉభయ సభలు ఏప్రిల్ 3వ తేదీ వరకు వాయిదా పడ్డాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)