మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కూతురిని చంపిన తండ్రి !

Telugu Lo Computer
0


బీహార్‌లోని మాధేపురా జిల్లాలోని సింహేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత్ర తోలాలో మద్యం కోసం శివరామ్ తన 24 ఏళ్ల కుమార్తె తలపై తుపాకీతో కాల్చాడు. మృతురాలు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పెళ్లి నిమిత్తం గ్రామానికి వచ్చింది. నిందితుడైన శివరాం మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే యువతి కుటుంబ పోషణ నిమిత్తం ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది. యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మేలో పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ యువతి బీహార్‌లోని తన గ్రామానికి వెళ్లింది. పెళ్లికి ముందు ఆమె ఇల్లు కట్టుకుంది. కానీ తండ్రి మద్యం కోసం ఎప్పుడూ డబ్బు ఇవ్వాలని వేధించేవాడు. సంఘటన జరిగిన రోజు కూడా శివరామ్ సాహ్ తన కుమార్తె కొత్త ఇంటికి తాగడానికి డబ్బులు అడిగేందుకు వెళ్లాడు. అయితే కూతురు డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఇంటి సభ్యులను దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత యువతి తండ్రికి నచ్చజెప్పింది. దీంతో శివరాం అక్కడి నుంచి తిరిగి వెళ్లి రాత్రి ఓ వ్యక్తితో కలిసి తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తి ముఖానికి కండువా చుట్టి ఉంది. యువతితో మాట్లాడడం ప్రారంభించిన తండ్రి ఆమె తలపై కాల్చి మోటారు సైకిల్‌పై పారిపోయాడు. తుపాకీ శబ్దం విని కుటుంబీకులు గ్రామస్థుల సహాయంతో ఆమెను మాధేపురాలోని జన్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)