యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 March 2023

యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి !


కర్ణాటక  శివమొగ్గ జిల్లా షికారిపురలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంజారా, భోవి సామాజిక వర్గాలకు చెందిన వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలోనే రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఎస్సీ రిజర్వేషన్లలో మొన్నటి వరకు బంజారాలు అధిక ప్రయోజనం పొందేవారు. కొత్తగా ఎస్సీ రిజర్వేషన్లలో కోటాలను సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉప కులాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. దీంతో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో 17 శాతం వరకు లబ్ధిపొందే బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 4.5 శాతానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే తమకు అన్యాయం జరుగుతోందని వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.

No comments:

Post a Comment