కరోనా మహమ్మారి వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో విమాన ప్రయాణాలు పెద్దగా సాగని విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 1,900 కోట్ల నికర లాభం ఆర్జించనుందని అంచనా. మూడో క్వార్టర్లో ఎయిర్లైన్స్ కంపెనీల పనితీరును బట్టి ఇది అర్థమవుతుంది. మార్కెట్ వాటా ప్రకారం దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్గా పేరొందిన ఇండిగో కిందటి క్వార్టర్లో రికార్డు లెవెల్ ప్రాఫిట్ ప్రకటించింది. మరోవైపు మొదలైన తర్వాత మొదటిసారిగా బ్రేక్ఈవెన్ సాధించినట్లు విస్తారా వెల్లడించింది. అనూహ్యంగా స్పైస్జెట్ లిమిటెడ్ కూడా తన లాభాన్ని నాలుగు రెట్లు పెంచుకుంది. ఈ కంపెనీకి రూ. 106.80 కోట్ల నికర లాభం వచ్చింది. న్యూఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టులు రెండూ ప్రైవేటు రంగంలోనే నడుస్తున్నాయి. ఈ రెండు ఎయిర్పోర్టుల వల్లే ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ఎందుకంటే ఈ రెండిటినీ నడిపే కంపెనీలు రెవెన్యూలో కొంత పర్సంటేజీని ఏఏఐకి చెల్లించాలి. ఎయిర్ ట్రాఫిక్ మెరుగుపడిన కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏఏఐ నికరలాభం సంపాదించనుందని స్పోక్స్పర్సన్ చెప్పారు. ఈ లాభం సుమారు రూ. 1,900 కోట్ల దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం జనవరి 2023 దాకా అంటే 10 నెలల్లో దేశంలోని ఎయిర్పోర్టులు 267 మిలియన్ల మంది పాసింజర్లను హ్యాండిల్ చేశాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. కొవిడ్కి ముందు అంటే 2019-20 లోని ఎయిర్ట్రాపిక్లో 91 శాతాన్ని ఈ ఏడాది అందుకోగలిగాయి. ఫిబ్రవరి నుంచి ఎయిర్ ట్రాఫిక్ జోరు మరింత పెరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో సగటున రోజుకి 4.2 లక్షల మంది విమాన ప్రయాణాలు చేశారు. డిసెంబర్ 2022 లో ఈ సంఖ్య 4.1 లక్షలు మాత్రమే. మార్చి 2022 తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో ఏఏఐకి రూ. 8.8 కోట్ల నికర లాభమే వచ్చింది. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో రెవెన్యూ రూ. 6,841 కోట్లు. 25 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా 2020-21 లో ఏఏఐ రూ. 1,962 కోట్ల నష్టం ప్రకటించింది. కరోనా కారణంగా ఎయిర్ ట్రావెల్ డిమాండ్ తగ్గిపోవడం వల్లే నష్టాలు వచ్చాయి. అదే కనక, 2019-20 కి చూస్తే ఏఏఐ రూ. 12,387 కోట్ల రెవెన్యూ మీద రూ. 1,985 కోట్ల నికర లాభం సంపాదించింది. 2021-22 కి డివిడెండ్ చెల్లించలేమని ప్రభుత్వాన్ని అనుమతి కోరిన ఏఏఐ ఈ ఫైనాన్షియల్ ఇయర్కు మాత్రం నికరలాభంలో 30 శాతం దాకా డివిడెండ్గా ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఏఐ కింద దేశంలోని 100 ఎయిర్పోర్టులున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి.
Post Top Ad
adg
Tuesday, 14 March 2023
Home
900 కోట్ల నికర లాభం ఆర్జించనుందని అంచనా
Airlines
business
National
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 1
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
లాభాల బాటలో ఎయిర్లైన్స్
లాభాల బాటలో ఎయిర్లైన్స్
లాభాల బాటలో ఎయిర్లైన్స్
Tags
# 900 కోట్ల నికర లాభం ఆర్జించనుందని అంచనా
# Airlines
# business
# National
# ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 1
# ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
# లాభాల బాటలో ఎయిర్లైన్స్
About Telugu Lo Computer
లాభాల బాటలో ఎయిర్లైన్స్
Tags
900 కోట్ల నికర లాభం ఆర్జించనుందని అంచనా,
Airlines,
business,
National,
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 1,
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,
లాభాల బాటలో ఎయిర్లైన్స్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment