తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ లో విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టడంతో విద్యార్థి సాత్విక్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన మంత్రి సబిత ఇంద్రరెడ్డి విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ కు మంత్రి ఆదేశాలు జారీచేశారు. బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టీచర్ కొట్టిందని విద్యార్థి మృతి !
March 04, 2023
0
Tags