ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలో ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి గా గుర్తించిన పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ మందిర్ దేవాలయం సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరిన అంజి. ఆటోను ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)