నిద్ర తక్కువైతే కాళ్లలో రక్త సరఫరాకు ఆటంకం !

Telugu Lo Computer
0


రాత్రిపూట అయిదు గంటల కంటే తక్కువ సమయం నిద్రించేవారికి కాళ్లలో రక్త సరఫరా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్వీడన్‌ పరిశోధకులు ఓ అధ్యయనంలో గుర్తించారు. అలాంటి వ్యక్తులు- కాలి రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే 'పెరిఫెరల్‌ ఆర్టెరీ డిసీజ్‌ (పీఏడీ)' బారిన పడే ముప్పు పెరుగుతుందని తేల్చారు. పీఏడీ కారణంగా క్రమంగా పక్షవాతం, గుండెపోటు వంటి వ్యాధుల ముప్పు కూడా తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా పీఏడీతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధకులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)