మంత్రి ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని వ్యక్తి మృతి !

Telugu Lo Computer
0


కర్ణాటక లోని హాసన్‌ జిల్లా అర్సికెరెలోని గండాసి గ్రామంలో ఆ రాష్ట్ర  హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఎస్కార్ట్‌ వాహనం బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి చామరాజనగర్‌ జిల్లాలోని ప్రసిద్ధ కేత్రమైన మలే మహాదేశ్వర బెట్ట నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత జ్ఞానేంద్ర అతని కాన్వాయ్‌ ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. వ్యక్తిని ఢీకొట్టిన ఎస్కార్ట్‌ వాహనం ప్రధాన కాన్వాయ్‌లో భాగం కాదని, వారి వాహానాల వెనుకే ప్రయాణించిందని కర్ణాటక హోంమంత్రి కార్యాలయం పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)