రామచంద్ర పిళ్లై జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన రామచంద్ర పిళ్లైకి జ్యుడీషియల్ రిమాండ్‌ను 14 రోజులపాటు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితతోపాటు రామచంద్ర పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. అయితే, పిళ్లై కస్టడి ఈ రోజుతో ముగియనుండటంతో అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టుకు తలించగా.. మరోసారి పిళ్లైకి కోర్టు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పిళ్లైని ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, కవిత విచారణ ఇంకా కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)