రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 March 2023

రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ధాటికి బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డి కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి కార్లు ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో 4 కార్లు కాన్వాయ్ లోని వాహనాలు కాగా మరో రెండు కార్లు రిపోర్టర్స్ కి సంబంధించినవి. ఇందులో సిరిసిల్ల రిపోర్టర్స్ ఉండగా.. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తుంది. ప్రమాదానికి గురైన కార్లను రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 


No comments:

Post a Comment