త్రిపురలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి మోడీ హాజరు

Telugu Lo Computer
0


త్రిపురలో బీజేపీ  ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఈనెల 8న హాజరుకానున్నట్టు సీనియర్ అధికారి ఒకరు శనివారంనాడు తెలిపారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 32 సీట్లను గెలుచుకుని మెజారిటీ మార్క్‌ను దాటింది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఐపీఎఫ్‌టీ ఒక సీటు గెలుచుకుంది. ''త్రిపురలో ప్రధాని పర్యటనకు సంబంధించి సీనియర్ అధికారులతో చీఫ్ సెక్రటరీ ఎస్‌కే సిన్హా సమావేశం జరుపుతున్నారు. ఎస్‌పీజీ టీమ్ కూడా ఇవాళ వస్తోంది. మార్చి 8న త్రిపురలో ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి హాజరవుతున్నారు'' అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)