భూ తగాదాల నేపథ్యంలో పెదనాన్నతల నరికిన యువకుడు

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన బండమీది చంద్రయ్య(60)కు తమ్ముడి కుమారుడు రాకేష్ కు భూ తగాదాలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వరుసకు పెదనాన్న అయిన చంద్రన్నను హత్య చేసి తల మొండెం వేరు చేసినట్లు స్థానిక సీఐ నోముల వెంకటేశం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేశం తెలిపారు. తలను ఝరాసంగం పెట్రోల్ పంపు వద్ద పక్కన వేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తలను తీసుకొని బర్దిపూర్ గ్రామంలో తిరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)