భర్త వేధింపులు తాళలేక పిల్లలతో సహా ఆత్మహత్య

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నార్సింగ్ పూర్ లో మద్యం మత్తులో ఉన్న భర్త వేధింపుల నుంచి తప్పించుకోవడానికి భార్య యక్తవయసులో ఉన్న తన కుమారుడు, కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు భార్య అనిత కౌరవ్ (38), కుమారుడు సెజల్ (19), కుమార్తె షాని (16) ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. నార్సింగ్ పూర్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదర్వారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై మూడు మృతదేహాలు పడి ఉన్నట్లు మాకు సమాచారం వచ్చిందని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన కుమారుడి జేబులో నుంచి సూసైడ్ నోట్ బయటపడింది. తన తండ్రి తరచూ తాగి వచ్చి తమను ఇబ్బంది పెట్టడం వల్లే ముగ్గురం ఆత్మహత్య చేసుకున్నామని అందులో ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తండ్రిని అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)