ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్, ఢిల్లీ శివారున ఉన్న తిలక్ నగర్ కాలనీకి చెందిన సురేష్కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భార్య రీతు, సురేష్ మధ్య గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన సురేష్, చంపుతానని భార్యను బెదిరించాడు. అంతటితో ఆగకుండా వంట గదిలోని స్టవ్కు ఉన్న గ్యాస్ సిలిండర్ పైప్ను బయటకు తీయడంతో గ్యాస్ ఆ గదంతా వ్యాపించింది. సురేష్ భార్య రీతూ ఇది చూసి భయాందోళన చెంది, సహాయం కోసం కేకలు వేసింది. కుటుంబ సభ్యులతోపాటు ఇరుగు పొరుగు వారు కూడా అక్కడకు వచ్చి గ్యాస్ రెగ్యులేటర్ను ఆఫ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సురేష్ అంతలోనే చేతిలో ఉన్న లైటర్ను వెలిగించాడు. దీంతో గ్యాస్ వ్యాపించిన ఆ గదిలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో సురేష్, అతడి కుటుంబ సభ్యులు, పొరుగింటి వ్యక్తులతో సహా పది మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఢిల్లీలోని జీబీటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటన వివరాలు తెలుసుకున్నారు. సురేష్ కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్న తర్వాత అతడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
భార్యతో గొడవపడి ఇంటికి నిప్పు పెట్టిన ఘనుడు !
March 11, 2023
0
Tags