అసోంలో భూకంపం

Telugu Lo Computer
0


అసోం లోని కమ్రూప్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3.59 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.2గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని తెలిపింది. భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న కొందరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే.. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)