7 ఖండాలు - 135 దేశాలు - మూడేళ్లు - రూ. 75 లక్షలు !

Telugu Lo Computer
0


లైఫ్ ఎల్ సీ క్రూయిజెస్ అనే సంస్థ వరల్డ్ టూర్‌ కోసం బుకింగ్స్‌ను ఆహ్వానిస్తోంది. ఈ టూర్ మూడేళ్లు ఉంటుంది. ఎంవీ జెమినీ అనే క్రూయిజ్ షిప్‌లో టూర్ ఉంటుంది. నవంబర్ 1 నుంచి టర్కీ లోని ఇస్తాంబుల్ నుంచి ఈ వరల్డ్ టూర్ స్టార్ట్ అవుతుంది. ఈ టూర్‌లో భాగంగా ప్రయాణికులు 375 పోర్టులకు వెళ్తారు. దాదాపు 135 దేశాలను సందర్శిస్తారు. అన్ని ఖండాలకు వెళ్లి రావొచ్చు. ఈ షిప్ దాదాపు 1,30,000 మైల్స్ దూరం ప్రయాణించనుంది. ఇండియాలో తాజ్ మహల్ నుంచి రియో డీ జనెరో క్రీస్ట్ ద రెడీమర్ స్టాచు, మెక్సికో చిచెన్ ఇట్‌జా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మచు పిచు, గిజా పిరమ్స్ ఇలా ప్రపంచ అద్భుతాలను చూసి రావొచ్చు. అయితే ఈ టూర్ ధర మాత్రం భారీగానే ఉంది. 30 వేల డాలర్లు. మన కరెన్సీలు చెప్పుకుంటే దాదాపు రూ. 25 లక్షలు అవుతుంది. ఇది ఒక ఏడాదికి మాత్రమే. మూడేళ్లకు అయితే రూ. 75 లక్షల దాకా అవుతుంది. ఈ మూడేళ్ల లో ప్రపంచ టూర్‌లో భాగంగా కస్టమర్లు ప్రపంచంలోని 14 వింతల్లో 13 చూసి రావొచ్చు. సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా, కరేబియన్, సెంట్రల్ అమెరికా, ఉత్తర అమెరికా, హవాయి కాకుండా ఇతర ప్రాంతాలను చూసి రావొచ్చు. దేవాలయాలు, పర్వాతాలు, లోయలు, బీచులు ఇలా చాలా వాటిని చూడొచ్చు. ఎంవీ జెమిని షిప్‌లో 2 మీటింగ్ రూమ్స్, 14 ఆఫీస్‌లు, బిజినెస్ లైబ్రెరీ, రిలాక్సింగ్ లాంజ్, కేఫ్ ఇలా చాలా ఉంటాయి. ఆఫీస్ డ్యూటీ ఉన్న వారు కూడా ఈ టూర్‌కు వెళ్లొచ్చు. వారి పనులు చేసుకోవచ్చు. స్పా, స్విమ్మింగ్ పూల్, వరల్డ్ క్లాస్ డైనింగ్ వంటివి ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)