వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నైరుతి రైల్వే పలు రైళ్ళకు 229 అదనపు బోగీల ను శాశ్వత ప్రాతిపదికన అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేజోన్ ఒక ప్రకటన విడుదల చేసింది. జోన్ పరిధిలో సంచరించే 104 రైళ్ళకు ఈ అదపు బోగీలను అమర్చనున్నారు. కాగా ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు తాత్కాలికంగా 210 బోగీలను అందుబాటులోకి తెచ్చామని జోన్ జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ ఈ ప్రకటనలో తెలిపారు. 2022 ఏప్రిల్ నుంచి ప్రస్తుత ఏడాది జనవరి వరకు అదనపు బోగీలను అమర్చే పని పూర్తయిందన్నారు. రిజర్వేషన్ల వెయింటింగ్ లిస్టు 100 దాటగానే అదనపు బోగీని ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా యశ్వంతపుర-మురుడేశ్వరల మధ్య వారానికోసారి సంచరించే ప్రత్యేక రైలుతో సహా మొత్తం 10 ప్రత్యేక రైళ్ళ సంచారాన్ని పొడిగించాలని నిర్ణయించడం జరిగిందని ఇందుకు సంబంధించిన సమాచారం రైల్వే వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ప్రకటన తెలిపారు. వీటిని ప్రయాణీకులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.
వేసవి సెలవుల దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు !
March 08, 2023
0