కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే సంప్రదించాయి !

Telugu Lo Computer
0


వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమను సంప్రదించాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. అయితే ఆ రెండు పార్టీలను తాము దూరం పెట్టినట్లుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. గతంలో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని విసిగిపోయామని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో స్వంతంగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము 140 స్థానాల్లో గెలుస్తామని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తమ పార్టీకి 80 సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని చెప్పారు. గతంలో తమ పార్టీకి 15 సీట్లు కూడా రావన్న బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు 40 నుంచి 50 సీట్లు వస్తాయని చెబుతున్నాయని అన్నారు. దీనికి కారణం ఎంటని ప్రశ్ని్ంచారు. తమ పార్టీ సామన్యులకు చేరువయిందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)