బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, కోఆర్డినేటర్లు నియామకం

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ను అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు తివారిని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే, మహారాష్ట్రలోని ఆరు డివిజన్లకు కోఆర్డినేటర్లను కూడా సీఎం కేసీఆర్‌ నియమించారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్లుగా నాసిక్‌ డివిజన్‌ దశరథ్‌ సావంత్‌, పూణే డివిజన్‌ బాలా సాహెబ్‌ జయరాం, ముంబై డివిజన్‌ విజయ్‌ తానాజీ, ఔరంగాబాద్‌ డివిజన్‌ సోమ్‌నాథ్‌ తోరట్‌, నాగపూర్‌ డివిజన్‌ ద్యానెష్‌ వకుడ్కర్‌, అమరావతి డివిజన్‌ నిఖిల్‌ దేశ్‌ముఖ్‌.

Post a Comment

0Comments

Post a Comment (0)