ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని 14 ఆవులు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్గొండ జిల్లా అద్దంకి - నార్కెట్​పల్లి రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో 14 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ఘటన స్థలికి చేరుకున్న వేములపల్లి పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీ ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఒకొక్క ఆవు ధర రూ.50 వేలు వరకు ఉంటుందని, సుమారుగా రూ.9 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఊరురా తిప్పి వాటి కోసం కుటుంబానికి దూరంగా ఉంటూ పెంచిన ఆవులు తమకళ్ల ముందే చనిపోవడంతో వారి రోధనలు చూపరులను కలిసి వేశాయి. దీనికి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకొవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)