అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలను స్పీకర్ సీతారాం  ప్రారంభిచారు. వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. టీడీపీ సభ్యులు స్పీకర్ సీతారాం పై కాగితాలు చల్లారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. వరుసగా నాల్గో రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. డోలా వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణా, నిమ్మకాయల, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు, మంతెన సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)