దేశంలో కొత్తగా 1,134 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 1,300 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య ఉన్న రోగుల సంఖ్య 7,605కు చేరింది. గత 24 గంటల్లో 718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,41,60,997కు పెరిగింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసులు అందించారు. గత 24 గంటల్లో 7,530 డోసులు అందించారు. ప్రస్తుత రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.46 శాతం ఉండగా,వారపు పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది. గత 24 గంటల్లో చేసిన 89,078 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.06 కోట్ల పరీక్షలు చేశారు. మంగళవారం 699, బుధవారం 1,134, నేడు 1,300 కరోనా కేసులు నమోదవ్వడం భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)