వాచ్ మెన్ దాడిలో దొంగ మృతి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగ చోరీకి యత్నించాడు. దుండగుడు ఆలయంలో అలజడి చేయడంతో వాచ్ మెన్ గమనించాడు. దొంగను పట్టుకోవడానికి వాచ్ మెన్ ప్రయత్నించడంతో అతడిపై దుండగుడు దాడి చేశాడు. వాచ్ మెన్ కర్ర తీసుకొని దొంగపై దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగ కామారెడ్డి జిల్లా ఆరేపల్లి కి చెందిన గంధం రాజు (23) గా గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)