ముఖ్యమంత్రి కావాలనే తొందరేమీ తనకు లేదని, నితీష్ కుమార్ సారథ్యంలో మహాకూటమి ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగుతుందని ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే మహా కూటమి ప్రధాన లక్ష్యమని తెలిపారు. సొంత స్వార్థం చూసుకోకుండా మతశక్తుల ఆటలు కట్టించాలనే ఐడియాలజీతోనే తాము ముందుకు వెళ్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏ ఒక్క సీటూ దక్కకుండా ఆర్జేడీ, జేడీయూ గట్టి ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి తేజస్వి కంటే తన కుమారుడు సంతోష్ సుమన్కు ఎక్కువ అర్హతలున్నాయంటూ జితిన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలపై తేజస్వి స్పందిస్తూ, అది ఆయన కోరిక కావచ్చని, అందులో తప్పు లేదని అన్నారు. ప్రతి తండ్రి తన కొడుకు విజయం కోరుకుంటాడని, మీ కుమారుడు మీ కంటే గొప్పవాడు కావాలని మీరు మాత్రం కోరుకోరా ? అని విలేఖరులను తేజస్వి నవ్వుతూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కావాలనే తొందరేమీ లేదు !
February 22, 2023
0
Tags