డాక్టర్ ను తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లోని ఫజియాబాద్, మురాద్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో హాస్పిటల్ లోకి చొరబడి రౌండ్స్ కు వెళ్తున్న డాక్టర్ శంషాద్ (40)ను తుపాకీతో కాల్చి చంపారు. హాస్పిటల్ సిబ్బంది వెంటనే మరో హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే శంషాద్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న రూరల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ నిమిష్ పాటిల్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ పై క్లినిక్ కు చేరుకున్న దుండగులు శంషాద్ పై కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)