మైసూరు కోర్టుకు రాఖీసావంత్‌

Telugu Lo Computer
0


మైసూరుకు చెందిన ఆదిల్‌ఖాన్‌తో రాఖీసావంత్‌కు వివాహమైన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరి ఆదిల్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీసులకు రాఖీసావంత్‌ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ముంబైలో కేసులు నమోదు చేసి ఆదిల్‌ఖాన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మైసూరు వీవీ పురం పోలీసుస్టేషన్‌లో ఆదిల్‌ఖాన్‌పై ఇరానీ విద్యార్థిని అత్యాచారం ఫిర్యాదు చేసిన కేసు పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు ముంబై పోలీసుల కస్టడీ నుంచి మైసూరు పోలీసులు స్వాధీనం చేసుకుని సెషన్స్‌ కోర్టు ఎదుట హాజరుపరచి ఈనెల 27వరకూ కస్టడీకు తీసుకున్నారు. ఇదే సందర్భంలోనే రాఖీసావంత్‌ భర్త ఆదిల్‌ఖాన్‌పై మైసూరు కోర్టులో న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేశారు. ఆదిల్‌ మోసం చేశారని మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, రూ.1.65 కోట్లు నగదు తీసుకెళ్ళారని ఆరోపించారు. మోసం చేసిన ఆదిల్‌కు ఎట్టి పరిస్థితిలోను బెయిల్‌ మంజూరు చేయరాదని కోరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం కోర్టు ముందుకు వచ్చానన్నారు. చట్టపరంగానే వివాహం చేసుకున్నానని అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. మీడియాతో మాట్లాడుతూనే తల్లిని తలచుకుని మోసపోయానంటూ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆమె వెంట వున్న వారు ఓదార్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)