పూల తివాచీతో ఘన స్వాగతం !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఆమె కోసం ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై దట్టంగా గులాబీ పూల రేకులను తివాచీ మాదిరిగా పరిచి, స్వాగతం పలికారు. ఆమె శనివారం ఈ సమావేశాలకు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌పూర్‌లోని విమానాశ్రయం నుంచి ప్లీనరీకి వెళ్లే మార్గంలో తివాచీ మాదిరిగా గులాబీ పూల రేకులను పరిచారు. రెండు కిలోమీటర్ల పొడవున పూల తివాచీని ఏర్పాటు చేసేందుకు సుమారు 6,000 కేజీల గులాబీలను వినియోగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రంగు రంగుల దుస్తులు ధరించిన జానపద కళాకారులు నృత్యాలు చేస్తూ ఆమెకు స్వాగతం పలికారు.


Post a Comment

0Comments

Post a Comment (0)