ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 8న బుచ్చిబాబును కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేయగా న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో గోరంట్లను రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట అధికారులు హాజరుపరిచారు. కసు దర్యాప్తు పురోగతిని వివరించిన సీబీఐ కస్టడీని పొడిగించాలని కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది.అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.
గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ పొడిగింపు
February 25, 2023
0
Tags