వలస కార్మికులపై దాడి !

Telugu Lo Computer
0


తమిళనాడులో కదులుతున్న రైలులో వలస కార్మికులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‭గా మారింది. వలస కూలీలు రోజు మాదిరిగానే పనుల నిమిత్తం.. ప్యాసింజర్ రైలులో వెళ్తున్నారు. అదే కంపార్ట్మెంట్ లో ఉన్న మరో వ్యక్తి వలస కార్మికులపై దుర్భాషలాడాడు. మీరు మాట్లాడేది తమిళా, హిందీనా అని అడిగాడు. అందుకు సమాధానం చెప్పమని వారని రెచ్చగొట్టాడు. మీరు తమిళులు కాదు కదా అంటూ వారిని తిట్టాడు. అంతటితో ఆగకుండ రాష్ట్రంలో స్థానికుల ఉద్యోగాలను వలస కార్మికులు దొంగిలించారంటూ వారిపై దాడికి దిగాడు. తోటి ప్రయాణికులు అతడిని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా వారిని తీవ్రంగా కొట్టాడు. తీరా స్టేషన్ రాగానే రైలు దిగి పారిపోయాడు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)