గుజరాత్ లోని ఫార్మా కంపెనీలో పేలుడు : ఇద్దరి మృతి

Telugu Lo Computer
0


గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోని ఫార్మా కంపెనీలో సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు కార్మికులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వల్సాద్ జిల్లాలోని సారిగాం జీఐడీసీ కెమికల్ జోన్ లో ఉన్న వాన్ పెట్రోచెమ్ ఫార్మా కంపెనీలో ఆకస్మాత్తుగా సంభవించిన పేలుడులో భవనం దెబ్బతింది. ఈ పేలుడు అనంతరం ఫార్మాకంపెనీలో మంటలు రాజుకున్నాయి. ఈ పేలుడులో గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తర్వాత అగ్నిమాపక వాహనాలు వచ్చినా మంటలను అదుపు చేయలేక పోయారు. పేలుడు, అగ్నిప్రమాదం జరిగిన కంపెనీలో సెక్యూరిటీ సిబ్బంది లేరు. దీంతో కెమికల్ ఉన్నందు వల్ల మంటలను ఆర్పేందుకు నీటిని వెదజల్లలేదని అగ్నిమాపక శాఖ అధికారి రాహుల్ మురారీ చెప్పారు. ఈ పేలుడు, అగ్నిప్రమాదంలో ఇద్దరు మరణించారని వల్సాద్ ఎస్పీ విజయ్ సింగ్ చెప్పారు. ప్రమాదం జరిగినపుడు ఫార్మాకంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తేలలేదు. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)