రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై దొంగల మర్రి వద్ద లారీ, ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈఘటన కొండగట్టు సమీపంలోని బల్వంతాపూర్ వద్ద జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు 108 కాల్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)