ఢిల్లీ ఆస్పత్రిలో అరుదైన ప్లాస్మాఫెరిసిస్ ప్రక్రియ విజయవంతం

Telugu Lo Computer
0


బీహార్​కు చెందిన శివ (29), పార్వతి (21) దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. తల్లితో సహా ఆరుగురు కుటుంబానికి శివ ఏకైక జీవనాధారం. జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో శివ హెల్త్ ఒక్కసారిగా దెబ్బతింది. అతనికి లివర్ సిర్రోసిస్‌ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ చేయాలని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడని వెల్లడించారు. భర్తను ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో తన లివర్​ను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని డాక్టర్లకు తెలిపింది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ కోసం సెంట్రల్ ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్​కు వెళ్లాలని పార్వతికి డాక్టర్లు సూచించారు. అన్ని చెకప్​లు చేసిన డాక్టర్లు పార్వతి, శివల బ్లెడ్ గ్రూప్ ఒక్కటి కాదని తెలిపారు. బ్లెడ్ గ్రూప్ ఒకటి  కానందునా శివకు పార్వతి లివర్ సరిపోదన్నారు. మరోమార్గంలేక ప్లాస్మా-ఫెరిసిస్ ప్రక్రియ ద్వారా శివకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. దాదాపు 12 గంటలు కష్టపడిన 21 మంది డాక్టర్లు ప్లాస్మా-ఫెరిసిస్ ప్రక్రియతో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)