2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 31న ప్రారంభం కానుంది. హెవీవెయిట్ చెన్నై సూపర్ కింగ్స్ , డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీతో ప్రారంభం కానుంది. మార్చి 31న గుజరాత్ అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ పోటీలు మొత్తం 12 వేదికలపై జరగనున్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మే 28న అదే వేదికలో జరుగుతుంది. అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, జైపూర్, ముంబై, గౌహతి , ధర్మశాల మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మార్చి 31 నుండి మే 21 వరకు 12 నగరాల్లో 70 మ్యాచ్లు జరుగుతాయి. ఐపీఎల్ 2023లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు - ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్ Aలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గ్రూప్ బి లో ఉన్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ లు మార్చి 31న ప్రారంభం !
February 18, 2023
0