అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరు

Telugu Lo Computer
0


వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చిన అవినాష్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత నెల 28న మొదటిసారి అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటలపాటు విచారించారు. అప్పట్లో విచారణలో కాల్‌డేటాపై దృష్టి సారించారు. అనంతరం సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌లను కడపకు పిలిపించి విచారించారు. ఇదే కేసులో నిందితుడైన సునీల్‌యాదవ్‌ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌లో సీబీఐ కౌంటరు దాఖలు చేస్తూ వివేకా హత్యకు పన్నిన కుట్ర గురించి సమగ్రంగా వెల్లడించిన తరుణంలో... మరోమారు ఎంపీని విచారించనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)