రూ.3.09 లక్షల కోట్లతో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన బసవరాజ బొమ్మై

Telugu Lo Computer
0


కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం 2023-24 సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,09,182 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన బడ్జెట్‌ను ఆర్థికశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విధానసభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఏడాదితో పోలిస్తే రూ.43,462 కోట్ల అదనపు మొత్తంతో తాజా బడ్జెట్‌ను తయారు చేశారు. కరోనా తర్వాత తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రూ.402 కోట్ల మిగులు బడ్జెట్‌ను అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు సున్నావడ్డీ రూపంలో రూ.5 లక్షల వరకు రుణం, ప్రభుత్వ పీయూ (ఇంటర్‌), డిగ్రీ విద్యార్థులకు ఉచిత విద్య, విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రత్యేక బస్సులు, రామనగరలో రామమందిర నిర్మాణం, వీధి శునకాలను దత్తత తీసుకునేందుకు కొత్త కార్యక్రమాలను ఈ బడ్జెట్‌లో ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)