సోమనాథ్ ఆలయానికి రూ. 1.5 కోట్ల విరాళం అందజేసిన ముఖేశ్ అంబానీ

Telugu Lo Computer
0


మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి గుజరాత్ లోని సోమనాథ్ ఆలయనాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అంబానీ, ఆయన కుమారుడికి ఆలయ ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అభిషేకం నిర్వహించారు. కాగా సోమనాథుడి ఆలయాన్ని దర్శించుకోవడంతోపాటు, ఆలయ ట్రస్టుకు ముఖేశ్ అంబానీ రూ. 1.5 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. మహాశివరాత్రి సందర్భంగా అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ విరాళాన్ని అందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)