చిరంజీవి ఖాతాలో అరుదైన రికార్డు !

Telugu Lo Computer
0


మెగాస్టార్ చిరంజీవి కథలో తాజాగా ఓ అరుదైన రికార్డు వచ్చి పడింది. రీసెంట్ గా చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మాస్ మహారాజా రవితేజ, కేథరిన్, బాబీ సింహా, ప్రకాష్ రాజ్‌ తదితరులు కీలకపాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్‌ ను అందుకుంది. కథ, కథనం రోటీన్ ఉన్నప్పటికీ.. మెగాస్టార్‌ నుంచి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్ని ఈ సినిమాలో సమపాళ్లతో ఉన్నాయి. ఔట్ అండ్ ఔట్ ఊర మాస్ వీరయ్యగా చిరంజీవి ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నారు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనూ ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ ని అందుకుంది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి నుంచి ఐదు చిత్రాలు వచ్చాయి. అందులో మొదటిది `ఖైదీ నంబర్ 150`. ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ తో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత `సైరా నరసింహా రెడ్డి` అంచనాలను అందుకోలేక పోయినా ఓవరాల్ గా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ అనంతరం చిరు నటించిన ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవగా.. `గాడ్ ఫాదర్‌` ఫ్యాన్స్ ని మాత్రమే థియేటర్స్ రప్పించి రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటింది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య 3 రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల మార్క్ ని అందుకుంది. అంటే రీ ఎంట్రీ లో మెగాస్టార్ చిరంజీవి 5 సినిమాల్లో 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం రేపాయి. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో 4 సార్లు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన హీరోగా చిరు అరుదైన రికార్డును అందుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)