బాలకృష్ణ తక్కువ కాదు - చిరంజీవి ఎక్కువ కాదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 1ను తీసుకొచ్చింది. దీనిపై విమపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే సమయంలో ఇద్దరు పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ప్రభుత్వ ఆంక్షలతో ఒంగోలులో నిర్వహించే వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ప్లేస్‌ మారింది.. మరోవైపు, విశాఖ వేదికగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదిక కూడా మార్పు చేశారు.. ముందుగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గర వేదిక ఫిక్స్ చేయగా అక్కడ అధికారుల నుండి అనుమతి రాలేదు. దీంతో ఈ వేదికను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి మార్చారు. అయితే ఇక్కడ నుండి కూడా వేదిక మారిపోయింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్కే బీచ్ లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు ప్రశ్న ఎదురైంది.. దానిపై క్లారిటీ ఇచ్చిన ఆయన బాలకృష్ణ సినిమా ఫంక్షన్ లను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. చిరంజీవి మూవీ ఫంక్షన్ కి ఆర్కే బీచ్ లో నిబంధనలు ప్రకారం అనుమతులు ఇచ్చి ఉంటారని తెలిపారు. అంతేకానీ, మాకు బాలకృష్ణ తక్కువ, చిరంజీవి ఎక్కువ కాదు. రోడ్డు మీద సభలు పెట్టకూడదు అనేది జీవో ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇక, గతంలో ముద్రగడ పద్మనాభాన్ని ఏ చట్టం ప్రకారం నిర్బంధించారు, పరామర్శకి వస్తుంటే చిరంజీవిని రాజమండ్రిలో ఎందుకు అడ్డుకున్నారని ఫైర్‌ అయ్యారు కన్నబాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచారం కోసం మనుషులు ప్రాణాలు తీస్తున్నాడని మండిపడ్డారు. జీవో నెంబర్ 1 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. అధికార దాహం తప్ప చంద్రబాబుకి ఏమీ లేదని ఆరోపించారు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు అంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)