జననాంగం రెండుగా విడిపోయింది !

Telugu Lo Computer
0

 

ఆస్ట్రేలియాకు చెందిన మహిళ స్కార్లెట్ రోజ్ (30) వివాహం జరిగింది. శృంగారం సమయంలో విపరీతమైన బాధగా ఉండటంతో ఆమె ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంది. అయితే, బ్రెయిన్‌లో సమస్య కారణంగా ఈ పెయిన్ వస్తుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆ సమస్య అలాగే కొనసాగింది. ఇలావుండగా స్కార్లెట్ గర్భవతి అయ్యింది. 21 వారాల తరువాత పరీక్షకు వెళ్లగా, వైద్యులు ఆమెను పరిశీలించి జననాంగం రెండుగా విడిపోయినట్లు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని ట్రాన్స్‌వర్స్ వెజినల్ సెప్టం అంటారని వైద్యులు తెలిపారు. అయితే, దీనికి చికిత్స ఉందని  వైద్యులు చెబుతున్నారు. స్కార్లెట్ ఎదుర్కొంటున్న సమస్యను వైద్యులు ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన స్కార్లెట్ రోజ్ తన పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పుట్టుకతో వచ్చిన అసాధారణ పరిస్థితికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. తన భర్తతో కలిసి తన పరిస్థితి ఏంటనేది వివరించింది. 21 వారాల గర్భిణిగా ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకోగా విషయం బయటపడిందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)