నిర్మాణంలో ఉన్న భవనం కూలి పలువురికి గాయాలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పలువురుకి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నిర్మాణంలో ఉన్న భవనం నుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వెళ్లి చూడగా, నాలుగో అంతస్తులో నిర్మాణం లో ఉన్న స్లాబ్ కూలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భవనం లో పని చేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. నాలుగో అంతస్తులో స్లాబ్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసకుంది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రిస్యూ సిబ్బంది, పోలీసులు కూలిన శిధిలాలను తొలగిస్తున్నారు. శిధిలాల కింద కూలీలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)