మహారాష్ట్రలోని నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు, మరికొంతమంది గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కును ప్రయాణీకులతో వెళుతున్న బస్సు ఢీకొట్టింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. థానే, ఉల్లాస్ నగర్, అంబేర్నాథ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు బస్సులో షిర్డీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు.
నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదంలో పది మంది మృతి
January 13, 2023
0
Tags