అత్యంత ఖరీదైన పండు రూబీ రోమన్ గ్రేప్స్ !

Telugu Lo Computer
0


ఆరోగ్యానికి పండ్లు మేలు చేస్తాయి కాబట్టి, సీజన్‌ను బట్టి పండ్లు తినాలని వైద్యులు చెబుతారు. సాధారణంగా యాపిల్, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ పండ్లు కొని తింటుంటాం. యాపిల్స్ దాదాపు 100 నుంచి 150 రూపాయలు. ద్రాక్ష ధర 60 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. దానిమ్మ 100 నుండి 120 రూపాయల ధరలో కూడా లభిస్తుంది. అయితే, ఇలాంటి పండ్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఒకటి ఉంది. ఆ పండు ఒక గెల ఖరీదు 10 లక్షల రూపాయలు. జపాన్‌కు చెందిన రూబీ రోమన్ ద్రాక్ష ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. దాని ఎరుపు రంగు కారణంగా, దీనిని రూబీ రోమన్ గ్రేప్స్ అని పిలుస్తారు. రూబీ రోమన్ ద్రాక్ష విలువ కారణంగా ప్రపంచ రికార్డు బుక్‌లో చోటు సంపాదించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు అనే గుర్తింపును పొందింది. 2020లో జపాన్‌లో రూబీ రోమన్ ద్రాక్ష గుత్తి $12,000 (సుమారు రూ. 9.76 లక్షలు)కి వేలం వేయబడింది. ఈ రూబీ రోమన్ ద్రాక్షను హ్యోగో ప్రిఫెక్చర్‌లోని అమగాసాకిలోని సూపర్ మార్కెట్‌లో విక్రయించారు. ఈ పండు ఎప్పుడూ ఖరీదైన పండ్ల జాబితాలోనే ఉంటుంది. రూబీ రోమన్ ద్రాక్ష అధిక ధర కారణంగా, ఇది సూపర్ మార్కెట్లలో మాత్రమే లభిస్తుంది. జపాన్‌లో ఈ ఖరీదైన పండ్లను వారివారి దగ్గరివారికి, ప్రియమైన వారికి ఇచ్చుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో, వివాహాది శుభ కార్యక్రమాల్లో సమర్పించటం ఇక్కడ ఒక సంప్రదాయం. జపాన్‌లోని పండ్లు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన తనిఖీ ప్రక్రియ ద్వారా విక్రయించబడతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)