అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన వృద్ధురాలు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో హరిభేజీ అనే 81 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతున్న సదరు వృద్ధరాలు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బంధువలంతా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శ్మశాన వాటికకు తీసుకెళ్తున్న క్రమంలో మహిళ కళ్లు తెరిచింది. దీంతో బంధువులంతా ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఒక రోజు బతికిన హరిభేజీ తరువాత రోజు మరణించింది. డిసెంబర్ 23న ఆమెను ఫిరోజాబాద్ లోని ట్రామా సెంటర్ లో చేర్పించారు. మంగళవారం బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్థారించారు. ఈ క్రమంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తున్న క్రమంలో కళ్లు తెరిచింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం ఆమె పరిస్థితి విషమించడంతో చనిపోయింది. ఆ తరువాత ఆమె కుమారుడు సుగ్రీవ్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)