నా బయోపిక్ తీసేందుకు వచ్చారు !

Telugu Lo Computer
0

జయసుధ సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమెతో ఓ వ్యక్తి ప్రతి కార్యక్రమంలో ఆమె పక్కనే కనిపించడమే దీనికి కారణం. వారసుడు ప్రిరిలీజ్ ఈవెంట్లో కూడా ఓ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడంతో అంతా అలాగే అనుకున్నారు. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించింది. ఆ వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చారు. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని, తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని జయసుధ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే ప్రతి ఈవెంట్‌కు హాజరవుతున్నారని వెల్లడించింది. అతని పేరు ఫెలిపే రూయేల్స్ అని తెలిపింది. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.  జయసుధ మాట్లాడూతూ 'నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్‌లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల అమెరికా వెళ్లి అతడిని కలిశా.' అని చెప్పుకొచ్చారు జయసుధ. జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్‌ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)