మైనర్ బాలికలను వివాహమాడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అలాంటి భర్తలు జీవిత ఖైదు ఎదుర్కొంటారని వెల్లడించారు. అలాగే, మహిళలు మాతృత్వ అనుభూతిని పొందాల్సిన వయసు 22-30 ఏళ్లని, పెళ్లి కాని ఆడవాళ్ళు త్వరగా వివాహం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 కింద చర్యలు తీసుకోనున్నారు. అ
మైనర్ బాలికలను వివాహమాడిన వారిపై చర్యలు !
January 28, 2023
0
Tags